Telugu Global
Andhra Pradesh

పాపం వెంకన్న.. పార్టీ సమావేశంలో అవమానం

ఇవాళ ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ మీటింగ్ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో బుద్దా వెంకన్న ఫొటో పెట్టలేదట. దీంతో సమావేశానికి వెళ్లిన వెంకన్న.. అక్కడి నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయినట్టు సమాచారం.

పాపం వెంకన్న.. పార్టీ సమావేశంలో అవమానం
X

బుద్దా వెంకన్న పేరు రాజకీయాలు తెలిసిన వారందరికీ సుపరిచితమే. చంద్రబాబుపై ఈగవాలినా ఒంటికాలిపై లేస్తుంటారు ఈ నేత. ఇక కృష్ణా జిల్లాలో తన పట్టు నిలుపుకొనేందుకు బీసీ నేతగా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. విజయవాడ ఎంపీ.. మరికొందరు టీడీపీ నేతలతో బహిరంగంగానే ఘర్షణకు దిగుతుంటారు. కానీ చంద్రబాబు అండదండలు పుష్కలంగా ఉండటంతో ఈయన పార్టీలో నెగ్గుకురాగలుతారని చెప్పుకుంటారు.

ఇదిలా ఉంటే తాజాగా బుద్దా వెంకన్నకు తీవ్ర అవమానం జరిగినట్టు సమాచారం. ఇవాళ ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ మీటింగ్ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో బుద్దా వెంకన్న ఫొటో పెట్టలేదట. దీంతో సమావేశానికి వెళ్లిన వెంకన్న.. అక్కడి నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయినట్టు సమాచారం.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఫొటో పెట్టలేదని నేనేమీ ఫీల్ కావడం లేదు. కానీ కృష్ణా జిల్లా టీడీపీ పరిస్థితి చూస్తుంటే నాకు కన్నీరు వస్తుంది. ఇక్కడ ఎవరి మాట ఎవరూ వినరు. కలిసి పనిచేసుకుందామనే స్పృహ ఉండదు. ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇక్కడి నేతలకు క్లాస్ పీకినా వీళ్లకు ఇంకా బుద్ధి రావడం లేదు. నాకు విశాఖ పట్నంలో వేరే పని ఉంది. అందుకే మీటింగ్ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోతున్నా' అంటూ చెప్పుకొచ్చాడు బుద్దా. అయితే మీటింగ్ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఫొటో లేకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందినట్టు సమాచారం. మొత్తంగా కృష్ణా జిల్లా టీడీపీలో ఒక్కసారిగా లుకలుకలు బయటపడ్డాయి.

First Published:  13 Sep 2022 8:51 AM GMT
Next Story