Telugu Global
Andhra Pradesh

బీజేపీ, టీడీపీ ఇక్కడ శత్రువులు... అక్కడేమో మిత్రులు

అండమాన్ నికోబర్ దీవుల్లోని పోర్టుబ్లెయిర్ లో జరిగిన మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం అభ్యర్థికి బీజేపీ మద్దతుగా నిల్చింది. ఈ కూటమి మరోసారి మున్సిపల్ చైర్ పర్సన్ పదవి దక్కించుకుంది.

బీజేపీ, టీడీపీ ఇక్కడ శత్రువులు... అక్కడేమో మిత్రులు
X

ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ఎంత చెప్పినప్పటికీ చంద్రబాబును దగ్గరికి రానివ్వని బీజేపీ అండమాన్ నికోబర్ దీవుల్లో మాత్రం ఆ పార్టీని కౌగలించుకుంది. ఏపీలో చంద్రబాబుపై, టీడీపై విరుచుకపడే బీజేపీ నేతలు అక్కడ మాత్రం కలిసి పోటీ చేశారు.

అండమాన్ నికోబర్ దీవుల్లోని పోర్టుబ్లెయిర్ లో జరిగిన మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం అభ్యర్థికి బీజేపీ మద్దతుగా నిల్చింది. ఈ కూటమి మరోసారి మున్సిపల్ చైర్ పర్సన్ పదవి దక్కించుకుంది. ఈ విజయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు.పోర్టుబ్లెయిర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు బీజేపీ-టీడీపీ కూటమిని ఆయన అభినందించారు.పోర్టుబ్లెయిర్ ప్రజల సంక్షేమం కోసం మీ కృషి, అంకితభావం తగిన ఫలితాన్ని ఇచ్చాయని రెండు పార్టీల కూటమిని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ విజన్ పై ప్రజల్లో ఉన్న నమ్మకానికి ఇది గీటురాయి వంటిదని జేపీ నడ్డా పేర్కొన్నారు.

అండమాన్ లో జరిగిన ఈ పరిణామాలు రేపు ఆంధ్రప్రదేశ్ లో కూడా పునరావృతమవుతాయని అప్పుడే చంద్రబాబు కలలు కంటున్నాడు కావచ్చు.

First Published:  15 March 2023 1:56 AM GMT
Next Story