Telugu Global
Andhra Pradesh

రాయచోటిలో టీడీపీకి బిగ్‌షాక్.. వైసీపీలోకి కీలక నేత.!

రాయచోటి టికెట్‌ ఆశించి భంగపడ్డారు రమేష్‌ రెడ్డి. నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న రమేష్‌ రెడ్డికి కాకుండా మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డికి టికెట్‌ కేటాయించారు చంద్రబాబు.

రాయచోటిలో టీడీపీకి బిగ్‌షాక్.. వైసీపీలోకి కీలక నేత.!
X

రాయచోటిలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి రమేష్‌ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని సమాచారం. ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని అనుచరులు చెప్తున్నారు.

ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి.. రమేష్‌ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో చేరితే తగిన ప్రాధాన్యత కల్పిస్తామని రమేష్‌ రెడ్డికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీలో చేరేందుకు రమేష్‌ రెడ్డి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈనెల 9న వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.

రాయచోటి టికెట్‌ ఆశించి భంగపడ్డారు రమేష్‌ రెడ్డి. నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న రమేష్‌ రెడ్డికి కాకుండా మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డికి టికెట్‌ కేటాయించారు చంద్రబాబు. దీంతో పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు రమేష్ రెడ్డి. గతంలో లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు రమేష్ రెడ్డి.

First Published:  7 April 2024 4:04 AM GMT
Next Story