Telugu Global
Andhra Pradesh

గొల్లపల్లి బాటలోనే మండలి.. బాబుకు షాక్ తప్పదా..!

మండలి బుద్ధప్రసాద్‌తో వైసీపీ సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ ఫోన్‌లో మాట్లాడారని ఆయన అనుచరులు చెప్తున్నారు.

గొల్లపల్లి బాటలోనే మండలి.. బాబుకు షాక్ తప్పదా..!
X

తెలుగుదేశం పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఇక తాజాగా సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ సైతం పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనను వైసీపీ నేతలు సంప్రదించారని సమాచారం.

మండలి బుద్ధప్రసాద్‌తో వైసీపీ సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ ఫోన్‌లో మాట్లాడారని ఆయన అనుచరులు చెప్తున్నారు. వైసీపీ నేతలు ఆహ్వానిస్తున్నారంటూ మండలి తన అనుచరులకు సైతం సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

అవనిగడ్డ నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు మండలి. అయితే ఇటీవల విడుదల చేసిన జాబితాలో ఆయన పేరు ప్రకటించలేదు. అవనిగడ్డను జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుండడంతో ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ-జనసేన జాబితా విడుదలైన రోజు తీవ్ర అసంతృప్తితో సోషల్‌మీడియాలో పోస్టు కూడా పెట్టారు మండలి. జాబితాలో తన పేరు ప్రకటించనందుకు సంతోషంగా ఉందంటూ కామెంట్ చేశారు. ధనవంతులైన అభ్యర్థుల కోసమే పార్టీలు అన్వేషిస్తున్నాయంటూ చంద్రబాబుపై పరోక్ష విమర్శలు చేశారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న మండలి.. డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు.

First Published:  28 Feb 2024 7:39 AM GMT
Next Story