Telugu Global
Andhra Pradesh

ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె మాస్ వార్నింగ్

ప్రెస్‌మీట్లకు పిల్లాడిని తీసుకురాని అఖిలప్రియ అరెస్ట్ చేయగానే చంకలో పిల్లాడిని పెట్టుకుని సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తోందని జశ్వంతి రెడ్డి విమర్శించారు.

ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె మాస్ వార్నింగ్
X

తన తండ్రిపై దాడి చేయించిన భూమా అఖిల ప్రియపై ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జశ్వంతి రెడ్డి ఫైర్ అయ్యారు. అఖిలప్రియపై విరుచుకుపడుతూ ఒక వీడియోను విడుదల చేశారు. అందులో భూమా అఖిల ప్రియను లోక్లాస్ మనిషి అని అభివర్ణించారు. వచ్చే ఎన్నికల్లో భూమా అఖిలప్రియకు టికెట్ ఇస్తే తాము ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. పార్టీ కూడా ఆమె తీరు ఎలా ఉందో పరిశీలన చేయాలని కోరారు. అఖిలప్రియపై బుద్ధిలేని దున్నపోతు అంటూ ఘాటుగా విమర్శలు చేశారు.

టికెట్ ఇస్తే తాను గానీ, తన తండ్రి గానీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భూమా అఖిలప్రియ లాంటి మహిళా మనకు ప్రాతినిధ్యం వహించేది అన్న విషయాన్ని ఆళ్లగడ్డ ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. అఖిలప్రియను చిన్నప్పుడు తన తండ్రి ఎత్తుకుని పెంచాడని.. తండ్రి లాంటి వ్యక్తిపై దాడి చేయడానికి సిగ్గుగా అనిపించలేదా అని ప్రశ్నించారు. ఇప్పటికి తన తండ్రిపై మూడు సార్లు దాడికి ప్రయత్నించారని ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఏకంగా హత్య చేసేందుకు ప్రయత్నించారన్నారు.

నిన్న జరిగిన దాడికి తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్నారు. ప్రెస్‌మీట్లకు పిల్లాడిని తీసుకురాని అఖిలప్రియ అరెస్ట్ చేయగానే చంకలో పిల్లాడిని పెట్టుకుని సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తోందని జశ్వంతి రెడ్డి విమర్శించారు. అటు అఖిలప్రియ దంపతులను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా వారికి 14రోజుల రిమాండ్‌ను కోర్టు విధించింది. వారిని కర్నూలు సబ్ జైలుకు తరలించారు.

First Published:  17 May 2023 3:01 PM GMT
Next Story