Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు కోసం ఫ్లెక్సీ వేయించిన అంబటి..

తనను ఆంబోతు అంటూ కించపరిచేలా మాట్లాడిన చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చారు అంబటి. చంద్రబాబు రాజకీయ జీవితమంతా ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేయడమే కదా అంటూ సెటైర్లు పేల్చారు.

చంద్రబాబు కోసం ఫ్లెక్సీ వేయించిన అంబటి..
X

ఏపీ మంత్రులు మీటింగ్ పెడితే సహజంగా వెనక సీఎం జగన్ ఫ్లెక్సీ ఉంటుంది. కానీ అంబటి రాంబాబు తొలిసారిగా టీడీపీకి చెందిన ఫ్లెక్సీ వేయించి మీడియా సమావేశం నిర్వహించారు. ఆ ఫ్లెక్సీ ముందే ఆయన మీటింగ్ పెట్టారు. చంద్రబాబుని చెడామడా వాయించేశారు.

సత్తెనపల్లి పర్యటనలో భాగంగా బుధవారం స్థానిక మంత్రి అంబటి రాంబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ఆంబోతు అంటూ వ్యక్తిగత విమర్శలు చేశారు. దీంతో మరుసటి రోజే మంత్రి అంబటి ప్రెస్ మీట్ పెట్టారు. కేవలం చంద్రబాబుని తిట్టడం కోసమే మీడియా సమావేశం పెట్టిన అంబటి ప్రత్యేకంగా ఓ ఫ్లెక్సీ కూడా డిజైన్ చేయించారు. చంద్రబాబు సభకు జనమెవరూ రాలేదని దానికి ఈ ఫ్లెక్సీయే సాక్ష్యం అన్నారు. సత్తెనపల్లిలో టీడీపీ టికెట్ ఆశిస్తున్న ఐదుగురు ఆశావహులు జనాల్ని తోలినా 5వేలమంది కూడా రాలేదని, చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్ షో అని ఎద్దేవా చేశారు అంబటి.





నువ్వే ముసలి సైకో..

జగన్ ని సైకో అంటున్న చంద్రబాబు.. ముసలి సైకో అని మండిపడ్డారు అంబటి. అధికారం కోసం ఎవరి చంకయినా నాకుతావు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సత్తెనపల్లి సభకోసం టీడీపీ నేతలు మగవాళ్లకు మద్యం, ఆడవారికి చీరలు పంపిణీ చేశారని, చంద్రబాబుకి ఈ ఖర్మేంటని అన్నారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు తట్టా బుట్టా సర్దుకుని హైదరాబాద్ కి వెళ్లిపోవడం ఖాయమన్నారు అంబటి.

నేను ఆంబోతునా..?

తనను ఆంబోతు అంటూ కించపరిచేలా మాట్లాడిన చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చారు అంబటి. చంద్రబాబు రాజకీయ జీవితమంతా ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేయడమే కదా అంటూ సెటైర్లు పేల్చారు. కేవలం చంద్రబాబు విధానాల వల్లే పోలవరం కుంటుపడిందని చెప్పారు. పుట్టుకతో తనకు డయాఫ్రమ్ వాల్ గురించి తెలియదని మంత్రి అయ్యాకే తెలుసుకున్నానని వివరించారు. పేదవాళ్లను ధనవంతులుగా చేసే పథకం తన దగ్గర ఉందంటూ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు 14ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది పేదల్ని ధనవంతులుగా మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి అంబటి రాంబాబు.

First Published:  27 April 2023 7:37 AM GMT
Next Story