Telugu Global
Andhra Pradesh

వచ్చే ఏడాది నుంచే.. రెడీగా ఉండండి

వచ్చే విద్యాసంవత్సరం నుంచే విశాఖ నుంచి పరిపాలన మొదలుపెడుతున్నట్టు ప్రకటించారు. అందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌.

వచ్చే ఏడాది నుంచే.. రెడీగా ఉండండి
X

ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే విశాఖ నుంచి పరిపాలన మొదలుపెడుతున్నట్టు ప్రకటించారు. ఇందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. అసెంబ్లీలో మరోసారి బిల్లు పెడతామని స్పష్టం చేశారు. అది ఈ సమావేశాల్లోనా.. వచ్చే సమావేశాల్లోనా అన్నది మీరే చూస్తారన్నారని మీడియా ప్ర‌తినిధుల‌ను ఉద్దేశించి అన్నారు.

కర్నూలు న్యాయ రాజధానిగా కూడా ఏర్పాటవుతుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా అందుకు అనుకూలంగా ఉందని గుర్తుచేశారు. అమరావతివాదుల పాదయాత్ర సందర్భంగా విశాఖలో ఏం జరిగినా అందుకు చంద్రబాబే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖ వేదికగా ఇన్వెస్ట్‌మెంట్ మీట్ జరుగుతుందని మంత్రి చెప్పారు.

విశాఖలో భూ అక్రమాలు జరిగి ఉంటే టీడీపీ వాటిని నిరూపించాలని సవాల్ చేశారు. విశాఖలో రాజధానికి ఒక్క సెంటు ప్రైవేట్ భూమిని కూడా తాము తీసుకోవడం లేదన్నారు. అమరావతిలో, విశాఖలో జరిగిన భూక్రయవిక్రయాలు రెండూ ఒకటే ఎలా అవుతాయని మంత్రి ప్రశ్నించారు. అసెంబ్లీ వెలుపల మీడియా పాయింట్ వ‌ద్ద మంత్రి అమ‌ర్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

First Published:  16 Sep 2022 12:26 PM GMT
Next Story