Telugu Global
Andhra Pradesh

జగన్‌ బయోపిక్‌ నిర్మాతకు టీటీడీ సభ్యత్వం!

దాసరి కిరణ్‌ గతంలో వంగవీటి, జీనియస్, రామ్‌లీల వంటి చిత్రాలను నిర్మించారు. త్వరలో ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి జీవితాన్ని బయోపిక్‌గా రాంగోపాల్ వర్మ తెరకెక్కించబోతున్నారు. వ్యూహం, శపథం పేరుతో సినిమాలు తీయనున్నారు.

జగన్‌ బయోపిక్‌ నిర్మాతకు టీటీడీ సభ్యత్వం!
X

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్‌కు ఏపీ ప్ర‌భుత్వం చోటు కల్పించింది. హైదరాబాద్‌కు చెందిన సాహితీ ఇన్‌ఫ్రాటెక్ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణ ఇటీవల 900 కోట్ల రూపాయల కుంభకోణంలో చిక్కుకోవడంతో ఆయన టీటీడీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దాంతో ఖాళీ అయిన స్థానాన్ని దాసరి కిరణ్‌తో భర్తీ చేశారు.

దాసరి కిరణ్‌ గతంలో వంగవీటి, జీనియస్, రామ్‌లీల వంటి చిత్రాలను నిర్మించారు. త్వరలో ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి జీవితాన్ని బయోపిక్‌గా రాంగోపాల్ వర్మ తెరకెక్కించబోతున్నారు. వ్యూహం, శపథం పేరుతో సినిమాలు తీయనున్నారు.

ఈ సినిమాలకు దాసరి కిరణే నిర్మాతగా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది. టీటీడీ బోర్డు సభ్యుల్లో నేరస్తులున్నారంటూ దాఖలైన పిటిషన్ ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో కోర్టు తుది తీర్పుకు లోబడే నియామకం ఉంటుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం వెల్లడించింది.

First Published:  17 Dec 2022 2:23 AM GMT
Next Story