Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు చేసేది లుచ్ఛా రాజకీయం..

చంద్రబాబు ఇంత చేస్తున్నా.. కాపుల ఓట్లు చంద్రబాబుకు వేయిస్తానని పవన్‌ చెప్పడం సిగ్గుచేటని పోసాని అన్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలవగానే చంద్రబాబు వణికిపోతున్నాడని చెప్పారు.

చంద్రబాబు చేసేది లుచ్ఛా రాజకీయం..
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్ పార్టీ అభ్య‌ర్థుల‌కు తెలుగుదేశం పార్టీ సానుభూతిప‌రులు ఓట్లేయలేదని ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్, సినీ నటుడు పోసాని కృష్ణమురళి విమర్శించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందినవారి ఓట్లు పవన్‌ కల్యాణ్‌ తరఫున పోటీచేసిన అభ్యర్థులకు రాలేదని ఆయన చెప్పారు. సోమవారం విజయవాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు చేసేది లుచ్చా రాజకీయమని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పవన్‌ కల్యాణ్‌ను చంద్రబాబు సర్వనాశనం చేస్తారన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు ఓటేయొద్దని చంద్రబాబే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లకు చెప్పాడని పోసాని ఆరోపించారు. తెలంగాణలో 8 సీట్లలో పోటీచేసిన పవన్‌ కల్యాణ్‌కి అక్కడ ఎక్కువ ఓట్లు వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ సీట్లు అడుగుతాడనే ఉద్దేశంతోనే చంద్రబాబు అలా చేశారని ఆయన ఆరోపించారు. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు పవన్‌ కల్యాణ్‌ని కావాలనే దెబ్బకొట్టాడన్నారు.

చంద్రబాబు ఇంత చేస్తున్నా.. కాపుల ఓట్లు చంద్రబాబుకు వేయిస్తానని పవన్‌ చెప్పడం సిగ్గుచేటని పోసాని అన్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలవగానే చంద్రబాబు వణికిపోతున్నాడని చెప్పారు. సెటిలర్లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌లో చంద్రబాబు వల్లే కాంగ్రెస్‌కి ఒక్క సీటు కూడా రాలేదని ఆయన తెలిపారు. చంద్రబాబుని హైదరాబాద్‌ లోని సెటిలర్లంతా ఛీ కొట్టారని ఆయన చెప్పారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ మళ్లీ మోసం చేయడానికి ఏపీ ప్రజలు అమాయకులు కాదని పోసాని స్పష్టం చేశారు.

First Published:  11 Dec 2023 1:32 PM GMT
Next Story