Telugu Global
Andhra Pradesh

ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. ఎగ్జామ్ డేట్స్ ఇవే

మొత్తం 6,100 టీచర్ పోస్టుల్లో SGT - 2280, టీజీటీ - 1264, స్కూల్ అసిస్టెంట్‌ - 2,299, పీజీటీ - 215 పోస్టులు ఉన్నాయి.

ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. ఎగ్జామ్ డేట్స్ ఇవే
X

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది జగన్ సర్కార్‌. మొత్తం 6,100 టీచర్ పోస్టుల భర్తీ కోసం ఏపీ డీఎస్సీ -2024 నోటిఫికేషన్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ నెల 12 నుంచి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు చెప్పారు.

మొత్తం 6,100 టీచర్ పోస్టుల్లో SGT - 2280, టీజీటీ - 1264, స్కూల్ అసిస్టెంట్‌ - 2,299, పీజీటీ - 215 పోస్టులు ఉన్నాయి. ఈ నెల 12 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగనుంది. మార్చి 5 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు.


ఈ నెల 27 నుంచి మార్చి 9 వరకు టెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి 14న టెట్‌ తుదిఫలితాలు వెల్లడించనున్నారు. మార్చి 15 నుంచి 30 వరకు రెండు సెషన్స్‌లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 31న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 7న ఫలితాలు విడుద‌ల చేయనున్నారు.

First Published:  7 Feb 2024 11:16 AM GMT
Next Story