Telugu Global
Andhra Pradesh

ఏపీ కాంగ్రెస్‌ అభ్యర్థుల లిస్టు రెడీ.. పోటీలో ఉండేది వీళ్లే.!

పీసీసీ చీఫ్ షర్మిల కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి ఈ సారి కూడా పోటీకి దూరంగా ఉంటారని తెలుస్తోంది.

ఏపీ కాంగ్రెస్‌ అభ్యర్థుల లిస్టు రెడీ.. పోటీలో ఉండేది వీళ్లే.!
X

రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చింది. ఇవాళ ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్‌ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఈ అంశంపై చర్చించి.. లిస్టు రెడీ చేసింది. ఈ సమావేశానికి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల, CWC సభ్యులు రఘువీరా రెడ్డి హాజరయ్యారు. అభ్యర్థుల జాబితాను రేపు అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.

ఇక పీసీసీ చీఫ్ షర్మిల కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి ఈ సారి కూడా పోటీకి దూరంగా ఉంటారని తెలుస్తోంది. దాదాపు 17 స్థానాల్లో పార్లమెంట్ అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్‌ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. వారిలో పలువురి పేర్లు బయటకు వచ్చాయి.

కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థులు వీళ్లే -

రాజమండ్రి పార్లమెంట్ - గిడుగు రుద్రరాజు

బాపట్ల పార్లమెంట్ - జేడీ శీలం

కాకినాడ - పల్లంరాజు

అనకాపల్లి - వేగి వెంకటేశ్‌

విశాఖపట్నం - సత్యా రెడ్డి

ఏలూరు - లావణ్య

రాజంపేట - నజీర్ అహ్మద్‌

చిత్తూరు- చిట్టి బాబు

హిందూపూర్ - షహీన్

ఇక మిగిలిన స్థానాల్లోనూ త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. పెండింగ్ స్థానాల్లో కొన్ని లెఫ్ట్ పార్టీలకు కేటాయిస్తారని సమాచారం.

First Published:  1 April 2024 9:31 AM GMT
Next Story