Telugu Global
Andhra Pradesh

అది తెలుగు బూతుల పార్టీ.. ఇది రౌడీ సేన‌..! - సీఎం వైఎస్ జ‌గ‌న్ విమ‌ర్శ‌

చివ‌రికి తాను కుప్పంలోనే గెల‌వ‌లేన‌న్న భ‌యం చంద్ర‌బాబు నాయుడులో క‌నిపిస్తోంద‌ని సీఎం చెప్పారు. చంద్ర‌బాబు ప్ర‌తి మాటలోను, ప్ర‌తి తీరులోనూ అదే క‌నిపిస్తోంద‌ని తెలిపారు.

అది తెలుగు బూతుల పార్టీ.. ఇది రౌడీ సేన‌..! - సీఎం వైఎస్ జ‌గ‌న్ విమ‌ర్శ‌
X

అది తెలుగు బూతుల పార్టీ.. ఇది రౌడీ సేన‌..! - సీఎం వైఎస్ జ‌గ‌న్ విమ‌ర్శ‌

తెలుగుదేశం పార్టీని తెలుగు బూతుల పార్టీగా చేశార‌ని ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎద్దేవా చేశారు. జ‌న‌సేన పార్టీని రౌడీ సేన‌గా మార్చార‌ని తెలిపారు. ప‌శ్చిమ‌గోదావ‌రి న‌ర‌సాపురంలో సోమ‌వారం నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం వైఎస్ జ‌గ‌న్ మాట్లాడారు. చివ‌రికి తాను కుప్పంలోనే గెల‌వ‌లేన‌న్న భ‌యం చంద్ర‌బాబు నాయుడులో క‌నిపిస్తోంద‌ని సీఎం చెప్పారు. చంద్ర‌బాబు ప్ర‌తి మాటలోను, ప్ర‌తి తీరులోనూ అదే క‌నిపిస్తోంద‌ని తెలిపారు.

గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లు బైబై చెప్పార‌ని, ఆ త‌ర్వాత జ‌రిగిన అన్ని ఎన్నిక‌ల్లోనూ వైఎస్సార్ సీపీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌లు ఆశీర్వ‌దించార‌ని జ‌గ‌న్ తెలిపారు. చివ‌రికి కుప్పంలో కూడా వైఎస్సార్‌సీపీ నే గెలిచింద‌నే విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు.

గ‌త టీడీపీ ప్ర‌భుత్వ పాల‌న చూసిన ప్ర‌జ‌లు.. ఇదేం ఖ‌ర్మ‌రా బాబూ అనుకుని ఉంటార‌ని సీఎం వైఎస్ జ‌గ‌న్ చెప్పారు. అందుకే 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లు బైబై చెప్పార‌ని తెలిపారు. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, టీవీ 5.. తో చంద్ర‌బాబుకు దోచుకో.. పంచుకో.. తినుకో.. అనే ఒప్పందం ఉంద‌ని జ‌గ‌న్ చెప్పారు. చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు దోచుకోవ‌డం.. దానిని వీరంద‌రితో క‌లిసి పంచుకొని.. తిన‌డం.. ఇదే చేస్తార‌ని తెలిపారు. అందుకే వారు చంద్ర‌బాబును ఏర‌కంగానూ ప్ర‌శ్నించర‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. ప్ర‌శ్నిస్తానంటున్న వారు కూడా ప్ర‌శ్నించ‌డం లేద‌ని ప‌వ‌న్ నుద్దేశించి అన్నారు.

ప్ర‌జ‌లు ఒకే విష‌యం కొల‌మానంగా తీసుకోవాల‌ని జ‌గ‌న్ కోరారు. ప్ర‌తి కుటుంబంలోను, ప్ర‌తి ఇంటిలోనూ మంచి జ‌రిగిందా.. లేదా.. అన్న‌దే కొల‌మానంగా తీసుకోవాల‌ని కోరారు. మంచి జ‌రిగితే త‌మ ప్ర‌భుత్వానికి అండ‌గా నిల‌వాల‌ని కోరారు.

First Published:  21 Nov 2022 9:12 AM GMT
Next Story