Telugu Global
Andhra Pradesh

మార్గ‌ద‌ర్శి కార్యాల‌యాల్లో మ‌రోసారి సీఐడీ సోదాలు

మార్గ‌ద‌ర్శి చిట్‌ఫండ్స్‌లో రికార్డులు, ప‌న్నుల చెల్లింపులు వంటి అంశాల‌పై ఈ సోదాలు నిర్వ‌హిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 37 మార్గ‌ద‌ర్శి బ్రాంచిల్లో ఈ సోదాలు కొన‌సాగుతున్నాయి.

మార్గ‌ద‌ర్శి కార్యాల‌యాల్లో మ‌రోసారి సీఐడీ సోదాలు
X

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వివిధ మార్గ‌ద‌ర్శి బ్రాంచి కార్యాల‌యాల్లో గురువారం మ‌రోసారి సోదాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఏపీ సీఐడీ ఆధ్వ‌ర్యంలో ఈ సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ఏపీ సీఐడీ అధికారులతో పాటు రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్, విజిలెన్స్ అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు.

మార్గ‌ద‌ర్శి చిట్‌ఫండ్స్‌లో రికార్డులు, ప‌న్నుల చెల్లింపులు వంటి అంశాల‌పై ఈ సోదాలు నిర్వ‌హిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 37 మార్గ‌ద‌ర్శి బ్రాంచిల్లో ఈ సోదాలు కొన‌సాగుతున్నాయి. ఈ నెల 16, 17 తేదీల్లో రామోజీరావు, శైల‌జా కిర‌ణ్ విచార‌ణ‌కు రావాల‌ని సీఐడీ నోటీసులు ఇచ్చింది. 16న రామోజీరావు, 17న శైల‌జా కిర‌ణ్ ఈ విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సి ఉండ‌గా వారు గైర్హాజ‌ర‌య్యారు. గ‌తంలో కూడా రామోజీరావు, శైల‌జా కిర‌ణ్ విచార‌ణ‌కు గైర్హాజ‌రైన విష‌యం తెలిసిందే.

First Published:  17 Aug 2023 9:08 AM GMT
Next Story