Telugu Global
Andhra Pradesh

లారీని ఢీకొట్టిన ప్రైవేటు బస్సు.. ఏడుగురు మృతి – మరో 14 మందికి గాయాలు

ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

లారీని ఢీకొట్టిన ప్రైవేటు బస్సు.. ఏడుగురు మృతి – మరో 14 మందికి గాయాలు
X

అర్ధరాత్రి 2 గంటల సమయం.. అది చెన్నై నుంచి హైదరాబాద్‌ వెళుతున్న ప్రైవేటు బస్సు.. అందులో ప్రయాణికులంతా ఆదమరిచి నిద్రిస్తున్నారు. బస్సు నెల్లూరు జిల్లా కావలి మండలం ముసునూరు టోల్‌ప్లాజా సమీపంలో ఉండగా.. ఎదురుగా ఊహించని ప్రమాదం.. ఆగివున్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఏంజరిగిందో అర్థమయ్యేలోపే ప్రైవేటు బస్సు ఆ లారీని ఢీకొట్టింది.

ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో బస్సులోని ప్రయాణికులంతా చెల్లాచెదురుగా పడిపోయారు. పలువురు ప్రయాణికులు సీట్ల మధ్య ఇరుక్కుపోయారు. అసలే చీకటి సమయం కావడం.. ఏం జరిగిందో అర్థంగాక.. అంతా ఒక్కసారిగా భయంతో బెంబేలెత్తిపోయారు. ఈ ప్రమాదం వల్ల దెబ్బలు తగిలిన ప్రయాణికుల ఆర్తనాదాలతో ఒక్కసారిగా బస్సంతా అయోమయ పరిస్థితి నెలకొంది.

ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైనవారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.

First Published:  10 Feb 2024 1:15 PM GMT
Next Story