Telugu Global
Andhra Pradesh

AP: ప్రేమను తిరస్కరించిందని యువతిని నరికి చంపిన దుర్మార్గుడు - సీఎం సీరియస్

తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో ఓ యువకుడు యువతిని నరికి చంపాడు. ఏపీలోని కాకినాడ జిల్లాలో జరిగిన ఈ సంఘటనపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తక్షణం చర్యలు చేపట్టి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

AP: ప్రేమను తిరస్కరించిందని యువతిని నరికి చంపిన దుర్మార్గుడు - సీఎం సీరియస్
X

ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లాలో ఘోరం జరిగింది. తనను ప్రేమించడానికి తిరస్కరించిందనే కోపంతో ఓ దుర్మార్గుడు ఓ యువతిని నరికి చంపాడు.

కాకినాడ జిల్లా కాండ్రేగుల కూరాడలో గుబ్బల దేవిక అనే యువతి అమ్మమ్మ ఇంట్లో ఉంటూ డిగ్రీ ఫైనలియర్ చదువుకుంటోంది. కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన సూర్యనారాయణ అనే యువకుడు తనను ప్రేమించమంటూ ఆ యువతి వెంటపడుతున్నాడు. ఎప్పటికప్పుడు ఆమె తిరస్కరిస్తూ వస్తోంది. దాంతో కోపం పెంచుకున్న సూర్యనారాయణ ఈ రోజు స్కూటీ పై వెళ్తున్న దేవికను వెంబడించాడు. కొంత దూరం వెళ్ళాక ఆమెకు అడ్డుగా వెళ్ళి స్కూటర్ ను ఆపి తనతో తెచ్చుకున్న కత్తితో ఆమె మెడ నరికేశాడు. దాంతో దేవిక అక్కడికక్కడే మృతి చెందింది.

ఆ సంఘటనను చూసిన చుట్తుపక్కలవాళ్ళు సూర్యనారాయణను పట్టుకొని చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచార‍ం అదించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సూర్యనారాయణను అరెస్టు చేశారు. యువతి మృత దేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ చట్టం ప్రకారం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. వెంటనే కేసు విచారణ పూర్తి చేసి చార్జిషీటు దాఖలు చేయాలని స్పష్టం చేశారు. యువతి కుటుంబానికి అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు.

First Published:  8 Oct 2022 4:48 PM GMT
Next Story