Telugu Global
Andhra Pradesh

'బాబు పక్కన రెండు గంగిరెద్దులు'.. అంబటి ట్వీట్ వైరల్

2014లో జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి టీడీపీ, బీజేపీకి మద్దతుగా ప్రచారం చేశారు. 2014లో టీడీపీకి దూరం అయినప్పటికీ మళ్లీ ఇప్పుడు ఆ పార్టీకి దగ్గరయ్యారు.

బాబు పక్కన రెండు గంగిరెద్దులు.. అంబటి ట్వీట్ వైరల్
X

ఇవాళ రాజధాని గ్రామం మందడంలో నిర్వహించిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నేతలిద్దరూ భోగి మంటలు వెలిగించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులు, అమరావతి వ్యతిరేక ప్రతులను మంటల్లో వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గంగిరెద్దు పక్కన నిల్చుని ఫొటోలకు ఫోజులిచ్చారు.

ఈ ఫొటోను మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 'బాబు పక్కన రెండు గంగిరెద్దులు' అంటూ కామెంట్ కూడా పెట్టారు. మామూలుగా గంగిరెద్దు ఏం చెబితే దానికి తలూపుతుంటుంది. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు ఏది చెబితే దానికి తల ఊపుతాడంటూ.. మీనింగ్ వచ్చేలా అంబటి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

2014లో జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి టీడీపీ, బీజేపీకి మద్దతుగా ప్రచారం చేశారు. 2014లో టీడీపీకి దూరం అయినప్పటికీ మళ్లీ ఇప్పుడు ఆ పార్టీకి దగ్గరయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని.. అందుకే తన మద్దతు టీడీపీకి ప్రకటిస్తున్నట్లు పదేపదే చెబుతున్నారు. టీడీపీతో పొత్తు వద్దని చెబుతున్న పార్టీ నాయకులు తనకు అక్కరలేదని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. టీడీపీ ఏం చెబితే పవన్ కళ్యాణ్ అది వింటున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అంబటి చేసిన తాజా కామెంట్ సరిగ్గా సరిపోయిందనే అభిప్రాయాలు వినబడుతున్నాయి.

First Published:  14 Jan 2024 10:07 AM GMT
Next Story