Telugu Global
Andhra Pradesh

వైసీపీకి ఏమైనా బాండ్ రాసిచ్చామా..? - నటుడు పృథ్వీరాజ్

వైసీపీలో ఉన్నప్పుడు చాలా చిత్తశుద్దితో పనిచేశానని, ఆ విషయాన్ని దర్గా సమక్షంలోనే తాను చెబుతున్నానని.. తనపై విమర్శలు చేస్తున్న వారు కూడా ఇక్కడికి వచ్చి ప్రమాణం చేసి మాట్లాడాలన్నారు.

వైసీపీకి ఏమైనా బాండ్ రాసిచ్చామా..? - నటుడు పృథ్వీరాజ్
X

ఏపీ రాష్ట్రం దారితప్పి చాలా కాలమైందన్నారు నటుడు పృథ్వీరాజ్. కడప పెద్ద దర్గాను సందర్శించిన పృథ్వీ ఇప్పుడు అంతా ఆ భగవంతుడి చేతుల్లోనే ఉందన్నారు. రాష్ట్రానికి మంచి జరిగేలా ఆశీర్వదించాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్టు చెప్పారు.

అంతా బాగుంటుందని పెళ్లి చేసుకుంటాం.. ఆ తర్వాత తేడాలు వస్తే విడిపోతాం.. వైసీపీ నుంచి బయటకు రావడం అలాంటిదేనన్నారు. వైసీపీతోనే ఉంటానని బాండ్ రాసి ఇచ్చామా అని ప్రశ్నించారు. అక్కడ పద్ధ‌తులు నచ్చలేదు.. అందుకే బయటకు వచ్చేశాన‌న్నారు. అక్కడ మనుషులకు విలువ లేదని చెప్పారు.

వైసీపీలో ఉన్నప్పుడు చాలా చిత్తశుద్దితో పనిచేశానని, ఆ విషయాన్ని దర్గా సమక్షంలోనే తాను చెబుతున్నానని.. తనపై విమర్శలు చేస్తున్న వారు కూడా ఇక్కడికి వచ్చి ప్రమాణం చేసి మాట్లాడాలన్నారు. వైసీపీ కోసం ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా కష్టపడిన వ్యక్తిని తాను అని చెప్పారు. వైసీపీ నుంచి బయటకు రావడం అంతా భగవంతుడి లీలగానే భావిస్తున్నట్టు వివ‌రించారు.

First Published:  7 Dec 2022 2:02 PM GMT
Next Story