Telugu Global
Andhra Pradesh

ఒంటిపై దుస్తులు లేకుండా అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం

మృతిచెందిన యువతి వయస్సు 20 నుంచి 25 ఏళ్ల లోపు ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతురాలి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఒంటిపై దుస్తులు లేకుండా అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం
X

కాకినాడ జిల్లాలో దారుణ సంఘటన వెలుగు చూసింది. కాళ్లు చేతులు తాళ్లతో కట్టేసి ఒంటిపై దుస్తులు లేకుండా అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం కనిపించడం తీవ్ర కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు యువతిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

కాకినాడ జిల్లాలోని తుని మండలం రాజుల కొత్తూరులో తుని రహదారికి 100 మీటర్ల దూరంలో ఓ యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువతి ఒంటిపై దుస్తులు లేవు. కాళ్లు, చేతులను దుండగులు తాళ్లతో కట్టేశారు. గుర్తు తెలియని దుండగులు యువతిపై అత్యాచారం జరిపి ఆ తర్వాత హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మృతిచెందిన యువతి వయస్సు 20 నుంచి 25 ఏళ్ల లోపు ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతురాలి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘాతుకానికి పాల్పడ్డ దుండగుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. తుని రహదారికి అతి సమీపంలో యువతిపై అత్యాచారం జరిపి హత్య చేయడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

First Published:  19 May 2024 7:47 AM GMT
Next Story