Telugu Global
Andhra Pradesh

క‌న్న‌కొడుకును బ‌లితీసుకున్న క్ష‌ణికావేశం.. - 3నెల‌ల బిడ్డ‌ను గోడ కేసి బాదిన క‌న్న‌తండ్రి

అప్ప‌టికే వారి మ‌ధ్య విభేదాలు ఉండటంతో ఆ బైక్ తాను ఎక్క‌న‌ని సావిత్రి భీష్మించుకుంది. అంతేగాక త‌న త‌ల్లిదండ్రుల‌ను దూషించ‌డంతో మునిరాజా స‌హ‌నం కోల్పోయాడు.

క‌న్న‌కొడుకును బ‌లితీసుకున్న క్ష‌ణికావేశం.. - 3నెల‌ల బిడ్డ‌ను గోడ కేసి బాదిన క‌న్న‌తండ్రి
X

ఓ తండ్రి క్ష‌ణికావేశం బిడ్డ ప్రాణం తీసింది. భార్య‌తో గొడ‌వ‌లో స‌హ‌నం కోల్పోయిన తండ్రి మూడు నెల‌ల ప‌సికందును కాళ్లు ప‌ట్టుకుని గోడ‌కేసి కొట్టాడు. దీంతో ఆ ప‌సిప్రాణాలు అక్క‌డికక్క‌డే గాలిలో క‌లిసిపోయాయి. తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తిలో శ‌నివారం జ‌రిగిన ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. శ్రీ‌కాళ‌హ‌స్తిలోని వాట‌ర్ వ‌ర్క్స్ కాల‌నీకి చెందిన మునిరాజా పెయింట‌ర్‌. సావిత్రిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. రెండేళ్ల త‌ర్వాత వీరికి నిఖిల్‌ పుట్టాడు.

చ‌లి తీవ్ర‌త కార‌ణంగా బాలుడికి న్యుమోనియా సోక‌డంతో తిరుప‌తిలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స చేయించారు. ఇందుకోసం మునిరాజా త‌న బైక్‌ను అమ్మేశాడు. రెండు రోజుల త‌ర్వాత మ‌ళ్లీ జ్వ‌రం రావ‌డంతో నువ్వు ఆస్ప‌త్రిలో స‌రిగా చూపించ‌లేదంటూ భార్య గొడ‌వ‌కు దిగింది. కొడుకును ఆస్ప‌త్రికి తీసుకెళ్లేందుకు మునిరాజా త‌న తండ్రి బైక్‌ను తీసుకొచ్చాడు.

అప్ప‌టికే వారి మ‌ధ్య విభేదాలు ఉండటంతో ఆ బైక్ తాను ఎక్క‌న‌ని సావిత్రి భీష్మించుకుంది. అంతేగాక త‌న త‌ల్లిదండ్రుల‌ను దూషించ‌డంతో మునిరాజా స‌హ‌నం కోల్పోయాడు. ఇంత‌లో ప‌సికందు గుక్క‌ప‌ట్టి ఏడుస్తుండ‌టంతో దీనంత‌టికీ వీడే కార‌ణ‌మని భావించిన తండ్రి.. క్ష‌ణికావేశంలో బాలుడి కాళ్లు ప‌ట్టుకుని గోడ‌కేసి కొట్టాడు. ఈ ఘ‌ట‌న‌లో బాలుడు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు బాలుడి తండ్రి మునిరాజాను అరెస్టు చేశారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి త‌ర‌లించిన‌ట్టు వ‌న్‌టౌన్ సీఐ అంజు యాద‌వ్ తెలిపారు.

First Published:  27 Nov 2022 3:01 AM GMT
Next Story