Telugu Global
Andhra Pradesh

పెళ్లి బ‌ట్ట‌ల కోసం వెళ్లి వ‌స్తుండ‌గా ప్ర‌మాదం.. ఐదుగురి దుర్మ‌ర‌ణం

ఈ ఘ‌ట‌న‌లో అల్లీ సాహెబ్ (58), షేక్ నురోజ్ బాషా (28), రెహాన్ బేగం (40), అయాన్ (6), అమాన్ (4)మృతి చెందారు. వీరిలో ముగ్గురు స్పాట్‌లో చ‌నిపోగా, మ‌రో ఇద్ద‌రు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

పెళ్లి బ‌ట్ట‌ల కోసం వెళ్లి వ‌స్తుండ‌గా ప్ర‌మాదం.. ఐదుగురి దుర్మ‌ర‌ణం
X

అనంత‌పురం జిల్లాలో ఉద‌యాన్నే ఘోరం ప్ర‌మాదం జ‌రిగింది. గుత్తి స‌మీపంలో కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు చ‌నిపోయారు. మృతుల్లో ఇద్ద‌రు ప‌దేళ్ల‌లోపు చిన్నారులు కూడా ఉన్నారు. పెళ్లి బ‌ట్ట‌ల కోసం హైద‌రాబాద్ వెళ్లి వ‌స్తుండ‌గా ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది.

డివైడ‌ర్‌ను ఢీకొట్టి.. ఆపై లారీ ఢీకొట్టి

అనంత‌పురం రాణిన‌గ‌ర్‌కు చెందిన అల్లీ సాహెబ్ కుటుంబంలో పెళ్లి ఉండ‌టంతో పెళ్లి బ‌ట్ట‌ల కోసం హైద‌రాబాద్ వెళ్లారు. షాపింగ్ పూర్తి చేసుకుని, తిరిగి వ‌స్తుండ‌గా గుత్తి స‌మీపంలో కారు అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టింది. అదే స‌మ‌యంలో ఎదురుగా వ‌స్తున్న లారీ కారును ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జ‌య్యింది.

కారు డ్రైవ‌ర్ నిద్ర‌మ‌త్తే కార‌ణం!

ఈ ఘ‌ట‌న‌లో అల్లీ సాహెబ్ (58), షేక్ నురోజ్ బాషా (28), రెహాన్ బేగం (40), అయాన్ (6), అమాన్ (4)మృతి చెందారు. వీరిలో ముగ్గురు స్పాట్‌లో చ‌నిపోగా, మ‌రో ఇద్ద‌రు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. డ్రైవ‌ర్ నిద్ర‌మ‌త్తే ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని పోలీసులు భావిస్తున్నారు. రాత్రంతా వాహ‌నం న‌డుపుతూనే ఉన్న డ్రైవ‌ర్‌ ఒక్క‌సారి కునుకు వేయ‌డంతో కారు డివైడ‌ర్‌ను ఢీకొట్టడంతో ఎదురుగా వ‌స్తున్న లారీ కారును ఢీకొట్టింద‌ని పోలీసులు చెబుతున్నారు.

First Published:  18 May 2024 5:04 AM GMT
Next Story