ఎంపీగా పోటీ చేస్తా.. ఈటల హాట్ కామెంట్స్

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ రెండు స్థానాల్లో ఓడిన ఈటల.. పార్లమెంట్‌కు పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నారు.

Advertisement
Update: 2024-02-20 02:57 GMT

మాజీ మంత్రి, బీజేపీ నేత మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తప్పకుండా ఎంపీగా పోటీ చేస్తానన్నారు. పార్టీ ఆదేశిస్తే మల్కాజ్‌గిరి నుంచి బరిలో ఉంటానని మరోసారి తన మనసులో మాట బయటపెట్టారు.

ఇక పార్టీ మార్పు వార్తలపై తీవ్రంగా స్పందించారు ఈటల రాజేంద‌ర్‌. తాను పార్టీ మారే వ్యక్తిని కాదన్నారు. ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలతో కలిసి ఈటల కనిపించడం చర్చనీయాంశమైంది. దీంతో ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలను కొట్టిపారేసిన ఈటల క్లారిటీ ఇచ్చారు.

మల్కాజ్‌గిరి నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచారు. ఇక ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ రెండు స్థానాల్లో ఓడిన ఈటల.. పార్లమెంట్‌కు పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నారు. అయితే మల్కాజ్‌గిరి సీటును బీజేపీలో మురళీధర్‌రావు కూడా ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆయన పేరిట నియోజకవర్గంలో పోస్టర్లు కూడా కనిపిస్తున్నాయి

Tags:    
Advertisement

Similar News