కేసీఆర్ ఇంటి సమీపంలో క్షుద్రపూజలు.. ఎవరి పనంటే..!

సోమవారం అర్ధరాత్రి కొంతమంది యువకులు ఖాళీ స్థలంలో కనిపించారని స్థానికులు పోలీసులకు వివరించారు. ఎవరైనా ఆకతాయిల పనికావొచ్చని మరికొందరు చెప్పారు.

Advertisement
Update: 2024-04-17 04:06 GMT

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-14లోని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నివాసం సమీపంలో క్షుద్రపూజలు అంటూ ఓ వార్త కలకలం సృష్టించింది. కేసీఆర్‌ ఇంటికి సమీపంలోని ఖాళీ ప్లాట్‌లో మంగళవారం మధ్యాహ్నం ముగ్గు మధ్యలో ఒక బొమ్మకు పసుపు కుంకుమ చల్లి ఎర్రటి వస్త్రంలో నిమ్మకాయలు, మిరపకాయలు ఇతర సామగ్రిని గుర్తించి స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

విషయం నందినగర్‌ బస్తీలో వ్యాపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బంజారాహిల్స్‌ పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. సోమవారం అర్ధరాత్రి కొంతమంది యువకులు ఖాళీ స్థలంలో కనిపించారని స్థానికులు పోలీసులకు వివరించారు. ఎవరైనా ఆకతాయిల పనికావొచ్చని మరికొందరు చెప్పారు. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

Tags:    
Advertisement

Similar News