ఫేక్ సర్టిఫికెట్లున్న ఆ ఇద్దరు తెలంగాణ బీజేపీ ఎంపీలపై అనర్హ‌త వేటు వేయాలి... కేటీఆర్ డిమాండ్

ఎన్నికల అఫిడవిట్‌లో అబద్ధపు సమాచారాన్నివ్వడం క్రిమినల్ నేరం కాదా? ఈ ‍అంశాన్ని లోక్ సభ స్పీకర్ పరిశీలించి వీరిద్దరిపై అనర్హత వేటు వేయగలరా ? అని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు.

Advertisement
Update: 2023-04-04 06:13 GMT

ప్రధాని మోడీ విద్యార్హత వివాదం కొనసాగుతుండగానే ఇప్పుడు తెలంగాణ లో ఇద్దరు బీజేపీ ఎంపీల విద్యార్హతలపై కేటీఆర్ ప్రశ్నలు లేవనెత్తారు. ఇద్దరు బీజేపీ ఎంపీలు ఫేక్ సర్టిఫికెట్లతో చలామణి అవుతున్నారని, బీజేపీలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ టైపు వ్యక్తులు చాలా మందే ఉన్నట్టున్నారని కేటీఆర్ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.

''బీజేపీలో చాలా మంది మున్నాభాయ్ MBBSలు ఉన్నట్లు కనిపిస్తోంది

తెలంగాణకు చెందిన ఇద్దరు బిజెపి ఎంపీలకు కూడా రాజస్థాన్ , తమిళనాడు విశ్వవిద్యాలయాల నుండి నకిలీ సర్టిఫికేట్లు ఉన్నాయనే ఆరోపణలున్నాయి.

 ఎన్నికల అఫిడవిట్‌లో అబద్ధపు సమాచారాన్నివ్వడం క్రిమినల్ నేరం కాదా? ఈ ‍అంశాన్ని లోక్ సభ స్పీకర్ పరిశీలించి వీరిద్దరిపై అనర్హత వేటు వేయగలరా ?'' అని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News