సుప్రీం లో తనకు ఎదురు దెబ్బ అనే వార్తలు ఫేక్... కవిత క్లారిటీ

మీడియాలో వస్తున్న వార్తలు ఫేక్ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత క్లారిటీ ఇచ్చారు. అసలు తాను ఈ విషయంపై ఈ రోజు సుప్రీం కోర్టులో ఎలాంటి పిటిషన్ ను దాఖలు చేయలేదని ఆమె స్పష్టం చేశారు.

Advertisement
Update: 2023-03-17 09:07 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 20న కవిత ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉండగా ఈ విషయంపై సుప్రీం కోర్టులో ఈ నెల 24న కేసు విచారణకు రానుంది. అయితే కేసును 24న కాకుండా అర్జెంట్ గా విచారించాలంటూ కవిత ఈ రోజు సుప్రీం కోర్టుకు వెళ్ళారంటూ, అందుకు సుప్రీం కోర్టు నిరాకరించిందంటూ ఈ రోజు ఉదయం నుండి మీడియా వార్తలు వస్తున్నాయి.

అయితే మీడియాలో వస్తున్న ఈ వార్తలు ఫేక్ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత క్లారిటీ ఇచ్చారు. అసలు తాను ఈ విషయంపై ఈ రోజు సుప్రీం కోర్టులో ఎలాంటి పిటిషన్ ను దాఖలు చేయలేదని ఆమె స్పష్టం చేశారు. ఈ నెల 24న తన పిటిషన్ విచారణకు వస్తుందని ఆమె ట్వీట్ చేశారు. మీడియాలో వస్తున్న వార్తలను కవిత ఖండించారు. 

Tags:    
Advertisement

Similar News