అన్నపూర్ణ సూపర్‌ హిట్‌

373 కేంద్రాల్లో నడుస్తున్న అన్నపూర్ణ భోజనం పథకం ద్వారా ఇప్పటి వరకు 10కోట్ల 11 లక్షల భోజనాలు పంపిణీ చేశారు. దీంతో దేశంలోనే అతిపెద్ద భోజన పథకంగా అన్నపూర్ణ భోజన పథకం నిలిచింది.

Advertisement
Update: 2022-09-27 03:19 GMT

హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నపూర్ణ భోజన పథకం మరో మైలురాయిని అధిగమించింది. ఈ పథకంలో భాగంగా ఐదు రూపాయలకే ప్రభుత్వం భోజనం అందిస్తోంది. ప్రతి ఒక్కరి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం.. 2014లో ఈ పథకాన్ని ప్రారంభించింది. పేదలు, వలస కార్మికులు, విద్యార్థులు, చిరుద్యోగులకు ఈ పథకం గొప్ప ఊరటగా నిలిచింది.

373 కేంద్రాల్లో నడుస్తున్న అన్నపూర్ణ భోజనం పథకం ద్వారా ఇప్పటి వరకు 10కోట్ల 11 లక్షల భోజనాలు పంపిణీ చేశారు. దీంతో దేశంలోనే అతిపెద్ద భోజన పథకంగా అన్నపూర్ణ భోజన పథకం నిలిచింది. ఇప్పటి వరకు ఈ పథకంపై ప్రభుత్వం 190 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఈ పథకం ద్వారా రోజూ 45వేల మంది భోజనం చేస్తున్నారు. ఒక్కొక్క‌రికీ 400 గ్రాముల అన్నం, 120 గ్రాముల సాంబారు, 100 గ్రాముల పప్పు, 15 గ్రాముల పచ్చడి వడ్డిస్తుంటారు.

ఈ పథకం నిర్వాహణకు రోజుకు 16 లక్షలు ఖర్చు చేస్తున్నారు. కరోనా సమయంలోనూ పేదలకు ఈ పథకం పెద్ద ఊరటగా నిలిచింది. హరేకృష్ణ మూవ్‌మెంట్ సహకారంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. భోజన కేంద్రాల్లో టేబుళ్లు, కుర్చీలు, ఫ్యాన్లు, తాగునీటి సౌకర్యంతో ప్రైవేట్ హోటళ్లకు దీటుగా వీటిని నిర్వహిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News