హిస్టరీ రిపీట్ అవుద్ది.. బీజేపీ మేనిఫెస్టోపై రేవంత్

బీజేపీ మేనిఫెస్టో చెల్లని బ్యాంకు చెక్కుతో సమానమంటూ ఎద్దేవా చేశారు రేవంత్. చరిత్ర పునరావృతం కావడం ఖాయమన్నారు.

Advertisement
Update: 2024-04-15 05:01 GMT

బీజేపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోపై సెటైర్లు వేశారు సీఎం రేవంత్ రెడ్డి. వికసిత్ భారత్ పేరుతో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో.. 2004లో విడుదల చేసిన షైనింగ్ ఇండియా మేనిఫెస్టో తరహాలోనే ఫలితాలను పునరావృతం చేస్తుందన్నారు.

2004లో ప్రజలు బీజేపీ షైనింగ్ ఇండియా మేనిఫెస్టోను తిరస్కరించారని రేవంత్ గుర్తుచేశారు. ఇప్పుడు కూడా పదేళ్ల బీజేపీ పాలనపై అసంతృప్తితో ఉన్న ప్రజలు బీజేపీని రిజెక్ట్ చేయడం ఖాయమన్నారు.

త్వరలోనే రాహుల్ గాంధీ నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వం ప్రజల కష్టాలను దూరం చేస్తుందన్నారు. బీజేపీ మేనిఫెస్టో చెల్లని బ్యాంకు చెక్కుతో సమానమంటూ ఎద్దేవా చేశారు రేవంత్. చరిత్ర పునరావృతం కావడం ఖాయమన్నారు.

Tags:    
Advertisement

Similar News