తమ్మినేని సోదరుడి దారుణ హత్య..!

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు .. తమ్మినేని కృష్ణయ్య దారుణహత్యకు గురయ్యారు.

Advertisement
Update: 2022-08-15 08:21 GMT

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు .. తమ్మినేని కృష్ణయ్య దారుణహత్యకు గురయ్యారు. సోమవారం తెల్లవారుజామున ఖమ్మం జిల్లా తెల్లారుపల్లిలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను నరికి చంపారు. వేట కొడవళ్లు, కత్తులతో విచక్షణారహితంగా కాల్చి చంపారు. ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. తమ్మినేని కృష్ణయ్య కొంతకాలం క్రితం టీఆర్ఎస్ లో చేరారు.

సీపీఎం కార్యకర్త అయిన కృష్ణయ్య.. టీఆర్ఎస్ లో చేరడం.. పలువురు సీపీఎం కార్యకర్తలు, నేతలు జీర్ణించుకోలేకపోయినట్టు సమాచారం. ప్రస్తుతం కృష్ణయ్య.. టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరావుకు అనుచరుడిగా కొనసాగుతున్నారు. ' నా హత్యకు కుట్ర జరుగుతోంది. నన్ను చంపాలని పలువురు సీపీఎం నేతలు కాచుకొని కూర్చొన్నారు. నేను హత్యకు గురైతే వాళ్లతే బాధ్యత. పోలీసులు నాకు రక్షణ కల్పించాలి' అంటూ కృష్ణయ్య గతంలో ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రస్తుతం ఆయన హత్యకు గురవ్వడం గమనార్హం. ఖమ్మం జిల్లాలో సీపీఎం ఎంతో బలంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. కృష్ణయ్య హత్యతో ఒక్కసారిగా ఖమ్మం జిల్లా ఉలిక్కిపడింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టినట్టు సమాచారం.

Tags:    
Advertisement

Similar News