బీజేపీకి వరుస షాకులు.. మరో కీలక నేత రాజీనామా..!

టికెట్‌ విషయంలో తనను మాట మాత్రం సంప్రదించలేదని, టికెట్ ప్రకటించిన తర్వాత కూడా తనకు ఏ ఒక్క‌రూ ఫోన్‌ చేసి మాట్లాడలేదని ఆవేదనకు లోనయ్యారు.

Advertisement
Update: 2023-11-01 12:30 GMT

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. రాజీనామాల విషయంలో నేతలు ఒక‌రితో మ‌రొక‌రు పోటీ పడుతున్నారు. కీలక నేతలు కమలం పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. తాజాగా ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్‌ రెడ్డి బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

వరంగల్‌ వెస్ట్ నుంచి టికెట్ ఆశించిన రాకేశ్‌ రెడ్డి టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. వరంగల్‌ వెస్ట్ టికెట్‌ను రావు పద్మకు కేటాయించింది బీజేపీ. అయితే టికెట్‌ విషయంలో తనను మాట మాత్రం సంప్రదించలేదని, టికెట్ ప్రకటించిన తర్వాత కూడా తనకు ఏ ఒక్క‌రూ ఫోన్‌ చేసి మాట్లాడలేదని ఆవేదనకు లోనయ్యారు. వరంగల్‌ జిల్లాలో బీజేపీకి కార్యకర్తలను తయారు చేశానని భావోద్వేగానికి లోనయ్యారు. ఎంత అవమానించిన ఏనాడు అధిష్టానానికి ఫిర్యాదు చేయలేదన్నారు. పార్టీ ఏ బాధ్యత ఇచ్చిన చిత్త‌శుద్ధితో పనిచేశానని చెప్పుకొచ్చారు.

త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు రాకేష్‌ రెడ్డి. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేది త్వరలోనే స్పష్టం చేస్తానన్నారు. తనను నమ్ముకున్నవాళ్లకు, వరంగల్ జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి మేలు చేసే విధంగానే తన నిర్ణయం ఉంటుందన్నారు.

Tags:    
Advertisement

Similar News