రాత్రిపూట మహిళలను మధ్యలో దించేస్తే ఎలా? - సజ్జనార్ సారే సమాధానం చెప్పాలి

మధ్యలో దించేయడంతో మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహిళలను చూసిన తిమ్మాపూర్‌ క్రాస్‌ రోడ్డులోని గ్రామస్థులు ధర్మారం వైపు వెళ్తున్న చివరి బస్సును ఆపి వారిని ఎక్కించారు.

Advertisement
Update: 2024-03-22 06:57 GMT

రాత్రివేళ బస్సెక్కిన ఓ పదిమంది మహిళలను ఆర్టీసీ కండక్టర్‌ ఓవర్‌ లోడ్‌ పేరిట నిర్ధాక్షిణ్యంగా దారి మధ్యలో వదిలి వెళ్లాడు. ఈ ఘటన జగిత్యాలలో జరిగింది. జగిత్యాల నుంచి ధర్మారం వెళ్లే ఆర్టీసీ బస్సు గురువారం రాత్రి 8 గంటలకు జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌ నుంచి బయలుదేరింది. అయితే " బస్సు ఓవర్‌ లోడ్‌ అయింది. టికెట్లు ఇచ్చే మెషీన్‌లో చార్జింగ్‌ లేదు. మెషీన్‌ నుంచి టికెట్లు రావడం లేదు" అని సాకులు చెబుతూ తిమ్మాపూర్‌ శివారులోని నల్లగుట్ట వద్ద 10మంది మహిళలను కండక్టర్‌ దించేశాడు.

మధ్యలో దించేయడంతో మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహిళలను చూసిన తిమ్మాపూర్‌ క్రాస్‌ రోడ్డులోని గ్రామస్థులు ధర్మారం వైపు వెళ్తున్న చివరి బస్సును ఆపి వారిని ఎక్కించారు. ఆ బస్సులోనూ ఓవర్‌లోడ్‌ ఉందని కండక్ట‌ర్‌ చెప్పగా, గ్రామస్థులు బతిమాలి ఆ మహిళలను బస్సు ఎక్కించారు. ఈ విషయమై ఆర్టీసీ ఉన్నతాధికారులను వివరణ కోర‌గా వారు స్పందించలేదని సమాచారం.

Tags:    
Advertisement

Similar News