KCR బహిరంగ సభ.. రేవంత్‌ సర్కార్ షాకింగ్ డెసిషన్‌..!

చట్టం ప్రకారం పోలీసు అధికారుల ముందస్తు అనుమతి తీసుకోకుండా.. జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు నిర్వహించొద్దని ఎస్పీ సూచించారు.

Advertisement
Update: 2024-02-06 06:42 GMT

కృష్ణా ప్రాజెక్టులు KRMBకి అప్పగింతపై కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మధ్య డైలాగ్‌ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదే అంశంపై నల్గొండ జిల్లాలో ఫిబ్రవరి 3 వారంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది బీఆర్ఎస్. ఈ సభ ద్వారా కేసీఆర్ రీఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. దాదాపు 2 లక్షల మందితో భారీ బ‌హిరంగ‌ సభకు ప్లాన్ చేసింది బీఆర్ఎస్.

నల్గొండ జిల్లాకు సంబంధించి రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో నెల రోజుల పాటు 30, 30A పోలీస్ యాక్ట్ - 1861 అమలులోకి తెచ్చింది. ఈ మేరకు ఎస్పీ చందనా దీప్తి ప్రకటన విడుద‌ల‌ చేశారు.

ఈ చట్టం ప్రకారం పోలీసు అధికారుల ముందస్తు అనుమతి తీసుకోకుండా.. జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు నిర్వహించొద్దని ఎస్పీ సూచించారు. కేసీఆర్ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేయడంతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ యాక్ట్ అమల్లోకి తెచ్చిందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బ‌హిరంగ సభ నిర్వహించి తీరుతామని చెప్తున్నారు.

Tags:    
Advertisement

Similar News