Munugode Bypoll Result: 75 వేల ఓట్ల లెక్కింపు పూర్తి... టీఆరెస్ ఆధిక్యం

Munugode Bypoll Result: మునుగోడు ఓట్ల లెక్కింపులో ఐదవ రౌండ్ పూర్తయి ఆరవ రౌండ్ లెక్కింపు మొదలయ్యింది. ఇప్పటి వరకు 75 వేల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది.

Advertisement
Update: 2022-11-06 06:47 GMT

మునుగోడు ఓట్ల లెక్కింపులో ఐదవ రౌండ్ పూర్తయి ఆరవ రౌండ్ లెక్కింపు మొదలయ్యింది. ఇప్పటి వరకు 75 వేల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇంకా లక్షన్నర ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. ఐదో రౌండ్ పూర్తయ్యేసరికి టీఆరెస్ కు 32,405 ఓట్లు రాగా బీజేపీకి 30,975, కాంగ్రెస్ కు 10,055 ఓట్లు వచ్చాయి. ఐదో రౌండ్ పూర్తయ్యేసరికి టీఆరెస్ 1430 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

మరో వైపు ఓట్ల‌ లెక్కింపు లేటవడానికి కారణాన్ని ఛీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ వివరించారు. పోటీలో 47 మంది అభ్యర్థులు ఉన్నందున లెక్కింపు ఆలస్యమవుతోందని ఆయన చెప్పారు. ఉప ఎన్నికలు జరిగే మిగతా రాష్ట్రాల్లో చాలా తక్కువమంది పోటీలో ఉన్నందున ఫలితాలు ఫాస్ట్ గా వస్తున్నాయని ఆ విధంగా ఇక్కడ సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.  

Tags:    
Advertisement

Similar News

ఇకపై TGPSC, TGRTC