6 గ్యారంటీలు ఎక్కడ..? మంత్రిని నిలదీసిన మహిళలు

మ‌హిళ‌లు నిల‌దీయడంతో మంత్రి జూపల్లి కృష్ణారావు అస‌హ‌నం వ్యక్తం చేశారు. ఇలా గాయిగాయి చేస్తే ఏం అర్థం కావడం లేదు. ఎవ‌రు ఏం మాట్లాడుతున్నారో ఎలా తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు

Advertisement
Update: 2024-05-08 10:40 GMT

మంత్రి జూప‌ల్లి కృష్ణారావుకు చేదు అనుభవం ఎదురైంది. కొల్లాపూర్‌లో ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆయనపై మ‌హిళ‌లు తిర‌గ‌బ‌డ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని మంత్రిని నిల‌దీశారు. 6 గ్యారంటీల్లో ఒక్క గ్యారెంటీ మాత్రమే అమ‌లైంది, మిగ‌తా వాటి సంగతేంటని ప్రశ్నించారు. మిగిలిన 5 గ్యారంటీలు ఎప్పటిలోగా అమ‌లు చేస్తారో చెప్పాలని మంత్రిని నిలదీశారు. మిమ్మల్ని నమ్మి మోసపోయం, మళ్లీ ఇప్పుడు ఓటువేసి మోసపోమంటూ తెగేసి చెప్పారు.


మంత్రి అసహనం..

మ‌హిళ‌లు నిల‌దీయడంతో మంత్రి జూపల్లి కృష్ణారావు అస‌హ‌నం వ్యక్తం చేశారు. ఇలా గాయిగాయి చేస్తే ఏం అర్థం కావడం లేదు. ఎవ‌రు ఏం మాట్లాడుతున్నారో ఎలా తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అనుచరులు మహిళలకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అధికారంలోకి వచ్చిన 100రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News