కేసీఆర్‌కు గాయం.. యశోదలో చేరిక..!

ప్రగతి భవన్ నుంచి సొంత నియోజకవర్గం గజ్వేల్‌లోని ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు షిఫ్ట్‌ అయ్యారు. గత 5 రోజులుగా అక్కడే ఉంటున్నారు.

Advertisement
Update: 2023-12-08 03:58 GMT

బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్‌ గురువారం అర్ధరాత్రి యశోద హాస్పిటల్‌లో చేరారు. కాలుజారి పడటంతో ఆయనకు గాయమైనట్లు సమాచారం. కేసీఆర్ కాలి తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం సోమాజీగూడ యశోద హాస్పిటల్‌లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కేసీఆర్‌కు శస్త్రచికిత్స చేయాల్సి రావొచ్చని వెద్యులు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్సపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత సీఎం పదవికి రాజీనామా చేసిన ఆయన.. ప్రగతి భవన్ నుంచి సొంత నియోజకవర్గం గజ్వేల్‌లోని ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు షిఫ్ట్‌ అయ్యారు. గత 5 రోజులుగా అక్కడే ఉంటున్నారు. ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలతోనూ ఆయన సమావేశమయ్యారు. భవిష్యత్‌ ప్రణాళికపై చర్చించారు. ఇక గత నాలుగు రోజుల నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రజలను ఆయన కలుస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News