ఆమ్రపాలికి మరో రెండు బాధ్యతలు.. సర్కార్‌ కీలక నిర్ణయం

ఆమ్రపాలి ఇప్పటికే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ జాయింట్ కమిషనర్ గా, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Advertisement
Update: 2024-02-04 04:43 GMT

సీఎం రేవంత్‌ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. IAS ఆఫీసర్‌ కె.ఆమ్రపాలికి మరో రెండు కీలక బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్ లిమిటెట్‌-HGCL మేనేజింగ్ డైరెక్టర్‌, అవుటర్ రింగ్‌ రోడ్డు-ORR ప్రాజెక్టు డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, మెట్రో పాలిటన్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎం.దానకిషోర్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఆమ్రపాలి ఇప్పటికే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ జాయింట్ కమిషనర్ గా, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమ్రపాలి ఈ నాలుగు పోస్టులు నిర్వహించడానికి అన్ని కార్యాలయాలు ఒకే చోటుకు తరలిస్తున్నారు.

గతంలో కేంద్రంలో విధులు నిర్వహించారు ఆమ్రపాలి. డిప్యుటేషన్‌పై పీఎంవోలో కీలక బాధ్యతల్ని నిర్వహించారు. ఇటీవల జ‌రిగిన‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణకు తిరిగివచ్చిన ఆమ్రపాలికి HMDA కమిషనర్‌గా కీలక బాధ్యతలు అప్పగించింది రేవంత్ సర్కార్.

Tags:    
Advertisement

Similar News