టార్గెట్ మల్లారెడ్డి.. మళ్లీ వచ్చిన జేసీబీ

తాజాగా బొమ్మరాసిపేట పెద్ద చెరువు వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇక్కడ కూడా జేసీబీతో కూల్చివేతలు మొదలయ్యాయి.

Advertisement
Update: 2024-05-24 09:49 GMT

మాజీ మంత్రి మల్లారెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. మల్లారెడ్డికి సంబంధించిన నిర్మాణాలను వరుసబెట్టి కూల్చి వేస్తోంది, ఆక్రమణల తొలగింపు పేరుతో ఆయనకు నిద్రలేకుండా చేస్తోంది. రాజీకోసం ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. సీఎం రేవంత్ రెడ్డితో అపాయింట్ మెంట్ కుదిరిందని, అన్ని విషయాలు అక్కడే తేల్చుకుంటానని ఇటీవలే చెప్పారు మల్లారెడ్డి. ఇంతలోగా ఆయనకు చెందిన మరో ప్రహరీగోడను అధికారులు జేసీబీతో తొలగించారు.

శామీర్ పేట్ మండలంలోని బొమ్మరాసిపేట పెద్ద చెరువులో ప్రహరీగోడ నిర్మించారనేది మల్లారెడ్డిపై ఉన్న ఆరోపణ. చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ లోకి ప్రహరీగోడ వచ్చేసిందని, ఇది అక్రమ నిర్మాణమేనని అంటున్నారు అధికారులు. ఈ ప్రహరీని ఈరోజు కూల్చి వేశారు. ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు ఈ కూల్చివేతలను పర్యవేక్షించారు. చెరువులో ఉన్న మరికొన్ని నిర్మాణాలను కూడా తొలగించారు.

వరుస దాడులు..

ఆమధ్య మల్లారెడ్డి విద్యాసంస్థల్లో కొన్ని నిర్మాణాలు అక్రమం అంటూ కూల్చివేతలు మొదలు పెట్టారు పోలీసులు. రోడ్డు కూడా ధ్వంసం చేశారు. జీడిమెట్ల పరిధిలోని సుచిత్ర వద్ద రెండున్నర ఎకరాలకు సంబంధించి భూ వివాదం కూడా నడుస్తోంది. ఇక్కడ ప్రహరీకోసం చేసిన ఏర్పాటుని ఇటీవల పోలీసులు తొలగించారు. తాజాగా బొమ్మరాసిపేట పెద్ద చెరువు వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇక్కడ కూడా జేసీబీతో కూల్చివేతలు మొదలయ్యాయి. 

Tags:    
Advertisement

Similar News