గాడ్సేవాదులను కీర్తించవద్దు, అదే బాపుకు నిజమైన నివాళి ‍-కేటీఆర్ రీట్వీట్

''గాడ్సేను,గాడ్సేవాదులను కీర్తించవద్దు.ఈ హింసాత్మక వ్యక్తులు మన దేశాన్ని స‌మూలంగా నాశనం చేస్తారు'' అంటూ ఓ ప్రముఖ జర్నలిస్టు చేసిన ట్వీట్ ను కేటీఆర్ రీ ట్వీట్ చేశారు.

Advertisement
Update: 2022-10-02 12:06 GMT


భారతీయ జనతా పార్టీ, ఆరెస్సెస్ లపై ఒంటికాలి మీద లేచే తెలంగాణ మంత్రి కేటీఆర్, గాంధీ జయంతి సందర్భంగా ఆ భావజాలంపై మరో సారి విమర్శలు గుప్పించారు.

మతోన్మాద భావజాలం ఈ దేశాన్ని విభజనవైపు తీసుకెళ్తోందని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోందని, దేశ‌ ప్రజల ఐక్యతకు, దేశ అభివృద్దికి ఈ బీజేపీ, ఆరెస్సెస్ భావజాలం విఘాతం కలిగిస్తోందని ప్రతీ సారీ ఆరోపణలు చేసే కేటీఆర్ ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా ప్రముఖ జర్నలిస్టు సాక్షి జోషి చేసిన ట్వీట్ ను ను రీ ట్వీట్ చేశారు.

సాక్షి చేసిన ట్వీట్ లో ఆమె...

''గాడ్సేను,గాడ్సేవాదులను కీర్తించవద్దు

ఈ హింసాత్మక వ్యక్తులు మన దేశాన్ని స‌మూలంగా నాశనం చేస్తారు

నేటి యుగంలో ఈ విషయాన్ని మనం మరొక్కసారి గుర్తుంచుకోవాలి. అది మాత్రమే బాపు కు నిజమైన నివాళి అవుతుంది.''

ఈ ట్వీట్ ను కేటీఆర్ రీ ట్వీట్ చేయగా నెటిజనులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News