తెలంగాణలో తొలి విజయం కాంగ్రెస్‌దే.. - అశ్వారావుపేటలో బోణీ

ఇప్పటివరకు 64 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు మెజారిటీలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ 41 స్థానాల్లో మాత్రమే లీడ్‌లో ఉంది. బీజేపీ 8, ఎంఐఎం 4 స్థానాల్లో మాత్రమే లీడ్‌లో కొనసాగుతున్నారు

Advertisement
Update: 2023-12-03 07:07 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ తొలి బోణీ కొట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆదినారాయణ విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై 29,030 ఓట్ల ఆధిక్యంతో ఆయన జయకేతనం ఎగురవేశారు. 2018 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున మెచ్చా నాగేశ్వరరావు అక్కడ విజయం సాధించారు. అనంతరం ఆయన బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు అదే పార్టీ నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఇక మిగిలిన స్థానాలను పరిశీలిస్తే.. తెలంగాణలో పూర్తి మెజారిటీతో కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటివరకు 64 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు మెజారిటీలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ 41 స్థానాల్లో మాత్రమే లీడ్‌లో ఉంది. బీజేపీ 8, ఎంఐఎం 4 స్థానాల్లో మాత్రమే లీడ్‌లో కొనసాగుతున్నారు. ఇతరుల్లో ఒకరు లీడ్‌లో ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News

ఇకపై TGPSC, TGRTC