వడగళ్ల వాన ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేసీఆర్

పంటలకు ఎంత మేరకు నష్టం వాటిల్లిందో అధికారులు నివేదికలు సమర్పించిన తర్వాత మంగళవారం లేదా బుధవారం ముఖ్యమంత్రి పర్యటన చేపట్టవచ్చని సోమవారం రాత్రి ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement
Update: 2023-03-21 01:41 GMT

వడగళ్ల వానలు, అకాల వర్షాల కారణంగా పంటలకు అపార నష్టం వాటిల్లిన జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. వడగళ్ల వాన వల్ల జరిగిన నష్టాల వివరాలను తెలుసుకోవాలని సంబంధిత జిల్లా మంత్రులు, ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి కోరారు.

పంటలకు ఎంత మేరకు నష్టం వాటిల్లిందో అధికారులు నివేదికలు సమర్పించిన తర్వాత మంగళవారం లేదా బుధవారం ముఖ్యమంత్రి పర్యటన చేపట్టవచ్చని సోమవారం రాత్రి ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యమంత్రి ముందుగా, వడగళ్ల వాన వల్ల ఎక్కువగా ప్రభావితమైన‌ జిల్లాలను సందర్శించే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News