విజయశాంతికి బంపర్ ఆఫర్‌.. కాంగ్రెస్‌లో కీలక పదవి

ఈ కమిటీకి విజయశాంతి చీఫ్‌ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరించనుండగా.. మరో 15 మంది సభ్యులు కన్వీనర్లుగా ఉండనున్నారు. వీరిలో కోదండ రెడ్డి, మల్లు రవి, రాములు నాయక్, పారిజాత రెడ్డి లాంటి ప్రముఖ నాయకులు ఉన్నారు.

Advertisement
Update: 2023-11-18 05:17 GMT

విజయశాంతికి బంపర్ ఆఫర్‌.. కాంగ్రెస్‌లో కీలక పదవి

బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన సీనియ‌ర్ లీడ‌ర్‌ విజయశాంతి కీలక పదవి పొందారు. పార్టీలో చేరిన 24 గంటల్లోనే విజయశాంతికి క్యాంపెయిన్ అండ్ ప్లానింగ్ కమిటీకి చీఫ్‌ కో-ఆర్డినేటర్‌గా పదవి కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు పార్టీ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆదేశాలు జారీ చేసింది కాంగ్రెస్ పార్టీ.

ఈ కమిటీకి విజయశాంతి చీఫ్‌ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరించనుండగా.. మరో 15 మంది సభ్యులు కన్వీనర్లుగా ఉండనున్నారు. వీరిలో కోదండ రెడ్డి, మల్లు రవి, రాములు నాయక్, పారిజాత రెడ్డి లాంటి ప్రముఖ నాయకులు ఉన్నారు.



గురువారం బీజేపీకి రాజీనామా చేసిన విజయశాంతి శుక్రవారం AICC చీఫ్ మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. విజయశాంతి లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తారని సమాచారం. గతంలోనూ కాంగ్రెస్‌ పార్టీలో ఏడేళ్లు పనిచేశారు విజయశాంతి.

Tags:    
Advertisement

Similar News