రేవంత్‌ RSS కార్యకర్త- కేటీఆర్

రైతుల ఖాతాల్లో కేంద్రం డబ్బులు వేస్తే నోరు మెదపని రేవంత్.. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు.

Advertisement
Update: 2023-11-26 08:27 GMT

ఎన్నికల వేళ రైతుబంధు స్కీం మీద కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు కౌంటరిచ్చారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. రైతుబంధేం కొత్త స్కీమ్‌ కాదన్నారు. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలకు ఎన్నికల కోడ్‌ వర్తించదని క్లారిటీ ఇచ్చారు. రైతుల ఖాతాల్లో రైతుబంధు పైసలు వేస్తే రేవంత్‌ రెడ్డి ఎందుకు ఆగమవుతున్నాడని ప్రశ్నించారు. పీఎం కిసాన్‌ నిధులు ఇస్తే తప్పు లేదుకానీ రైతు బంధు ఇస్తే తప్పా అని ప్రశ్నించారు.

రేవంత్‌రెడ్డిలో ఇంకా RSS భావజాలం అలాగే ఉండిపోయిందని చురకలు అంటించారు కేటీఆర్. అందుకే రైతుల ఖాతాల్లో కేంద్రం డబ్బులు వేస్తే నోరు మెదపని రేవంత్.. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. రైతులకు డబ్బులు వస్తుంటే రేవంత్‌కు ఏం నొప్పని ప్రశ్నించారు కేటీఆర్.

తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్‌ ఈ ఏడాది దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహిస్తామన్నారు. దీక్షా దివస్‌లో తెలంగాణ ప్రజలంతా ఎక్కడికక్కడ పాల్గొనాలని పిలుపునిచ్చారు. వందలాది తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.

Tags:    
Advertisement

Similar News