వరంగల్‌, చేవెళ్ల అభ్యర్థుల ప్రకటన.. కడియంకు కేసీఆర్‌ డబుల్ ధమాకా

ఇప్పటికే కరీంనగర్ నుంచి బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌, ఖమ్మం నుంచి నామా నాగేశ్వర రావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థిత్వాలను ఖ‌రారు చేశారు కేసీఆర్.

Advertisement
Update: 2024-03-13 15:11 GMT

లోక్‌సభ ఎన్నికల కోసం మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇప్పటికే నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్.. ఇవాళ వరంగల్‌, చేవెళ్ల స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేశారు.

వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆరూరి రమేష్‌ విముఖత వ్యక్తం చేయడంతో ఎంపీ అభ్యర్థిగా మాజీ డిప్యూటీ సీఎం, ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు అవకాశమిచ్చారు. ఇక చేవెళ్ల నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీ చేయనని చెప్పడంతో.. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌కు అవకాశమిచ్చారు.


ఇప్పటికే కరీంనగర్ నుంచి బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌, ఖమ్మం నుంచి నామా నాగేశ్వర రావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థిత్వాలను ఖ‌రారు చేశారు కేసీఆర్. మొత్తంగా ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. మరో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా.. పొత్తులో భాగంగా రెండు స్థానాలు బీఎస్పీకి ఇస్తారని తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News