టచ్‌లో 60మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు - ఈటల సంచలనం

కాంగ్రెస్‌ నాయకులు, సీఎం రేవంత్‌ రెడ్డి మాటలకు హద్దు లేకుండా పోయాయని మండిపడ్డారు ఈటల. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే వాళ్ల మాటలు కోటలు దాటుతున్నాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisement
Update: 2024-03-30 04:54 GMT

బీఆర్ఎస్‌ పని ఖతం అయింది.. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లోకి వస్తారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత ఈటల రాజేందర్. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవడం పెద్ద పని కాదన్నారు. తలుచుకుంటే 60 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లోకి వస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈటల.

కాంగ్రెస్‌ నాయకులు, సీఎం రేవంత్‌ రెడ్డి మాటలకు హద్దు లేకుండా పోయాయని మండిపడ్డారు ఈటల. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే వాళ్ల మాటలు కోటలు దాటుతున్నాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కేసీఆర్ తరహాలోనే రేవంత్ ప్రభుత్వం డబ్బుతో నాయకులను, కార్యకర్తలను కొనుగోలు చేస్తోందని ఆరోపించారు ఈటల రాజేందర్. ప్రశ్నించే గొంతు పేరుతో గతంలో మల్కాజ్‌గిరిలో గెలిచిన రేవంత్ రెడ్డి.. ప్రజలను పట్టించుకోవడం మానేశారన్నారు ఈటల.

Tags:    
Advertisement

Similar News