మంటలంటుకున్న బస్సు -10 మంది సజీవ దహనం

మహారాష్ట్రలో ఓ ప్రైవేటు లగ్జరీ బస్సు కంటైనర్ తో ఢీకొనడంతో ఆ బస్సుకు మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది సజీవ దహనమయ్యారు. 32 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement
Update: 2022-10-08 02:41 GMT

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సుకు మంటలంటుకోవడంతో ఆ మంట‌ల్లో చిక్కుకొని 10 మంది ప్రయాణీకులు సజీవదహనం అయ్యారు. 

నాసిక్ నుంచి ఔరంగాబాద్ జాతీయ రహదారిపై నడుస్తున్న లగ్జరీ ప్యాసింజరు బస్సులోమంటలు చెలరేగాయి. ఈ బస్సు ఓ కంటైనర్‌ను ఢీకొనడంతో నాసిక్ పట్టణ శివార్లలో ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం. ఈ రోజు ఉదయం 5 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు చెప్తున్నారు. ఈ ప్రమాదంలో మరో 32 మంది ప్రయాణీకులు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరందరినీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News