తన పతనానికి సుపారీ ఇచ్చారన్న మోడీ... వాళ్ళెవరో చెప్పాలన్న కపిల్ సిబాల్

మోడీని నాశనం చేస్తున్నవారెవరో పేర్లు వెల్లడించాలని ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ కోరారు. పేర్లు చెప్తే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.

Advertisement
Update: 2023-04-02 13:18 GMT

తనను పతనం చేయడానికి కొందరు సుపారీ ఇచ్చారని ప్రధాని మోడీ ఆరోపణలు చేసిన విషయంతెలిసిందే. వాళ్ళు తన సమాధి కట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనను నాశనం చేయడానికి ప్రయత్నించేవారికి దేశవిదేశాల్లో మద్దతుదారులున్నారని మోడీ అన్నారు.

అయితే మోడీని నాశనం చేస్తున్నవారెవరో పేర్లు వెల్లడించాలని ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ కోరారు. పేర్లు చెప్తే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. వ్యక్తులు కానీ, సంస్థలు కానీ ఎవరైనా ఆ పేర్లు బైటపెట్టాలని, ఇది దేశ రహస్యంగా మిగిలిపోకూడదు అని కపిల్ సిబాల్ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడ్డ తర్వాత, ఆ పరిణామాలపై జర్మనీ, బ్రిటన్ తో సహా పలు దేశాలు విమర్శనాత్మకంగా స్పంధించాయి. ఈ నేపథ్యంలో మోడీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Tags:    
Advertisement

Similar News