బండేమఠం గుట్టు రట్టు.. బీటెక్ విద్యార్థినితో హనీట్రాప్

45 ఏళ్ల బసవలింగ స్వామికి ఎరవేయడానికి కన్నూరు మృత్యుంజయ స్వామి బీటెక్ స్టూడెంట్‌ని ఉపయోగించుకున్నాడు. వారి ఏకాంత వీడియోలను చిత్రీకరించి వాటిని చూపించి బెదిరించేవాడు.

Advertisement
Update: 2022-10-31 05:52 GMT

కర్నాటకలో ఇటీవల బండేమఠ బసవలింగ స్వామి ఆత్మహత్య కలకలం రేపింది. హనీట్రాప్‌కి పాల్పడ్డారని, వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఆయన రాసిన లెటర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చివరకు హనీట్రాప్‌కి కారణం ఎవరో కనిపెట్టారు. బండే మఠాన్ని హస్తగతం చేసుకోడానికి బసవలింగ స్వామి దగ్గరి బంధువైన కన్నూరు మృత్యుంజయ స్వామి.. ఈ దారుణానికి ఒడిగట్టారు. అతనితోపాటు సూసైడ్ నోట్‌లో పేరున్న నీలాంబికను అరెస్ట్ చేశారు. నీలాంబిక ఇంజినీరింగ్ విద్యార్థిని కావడం విశేషం.

45 ఏళ్ల బసవలింగ స్వామికి ఎరవేయడానికి కన్నూరు మృత్యుంజయ స్వామి బీటెక్ స్టూడెంట్‌ని ఉపయోగించుకున్నాడు. వారి ఏకాంత వీడియోలను చిత్రీకరించి వాటిని చూపించి బెదిరించేవాడు. 21 ఏళ్ల బీటెక్ విద్యార్థిని నీలాంబిక అసలీపనికి ఎందుకు ఒప్పుకుందో తేలాల్సి ఉంది. సూసైడ్ నోట్‌లో బసవలింగ స్వామి మరో 8 మంది గురించి కూడా ప్రస్తావించారు. వారిని కూడా పోలీసులు విచారణకు పిలిపించారు. ప్రధాన నిందితుడు, బీటెక్ స్టూడెంట్‌ని మాత్రం అరెస్ట్ చేశారు.

నగ్న వీడియో కాల్స్..

బండేమఠాధిపతికి సంబంధించిన నగ్న వీడియోకాల్స్ కూడా ఇప్పుడు సంచలనంగా మారాయి. అయితే ఈ వీడియోకాల్స్ లో ఉన్న మహిళ తన వీడియో, ఆడియో రికార్డ్ కాకుండా జాగ్రత్తపడింది. ఆయన చనిపోయాక వరుసగా ఈ వీడియోలు లీకయ్యాయి. ఇప్పుడు కర్నాటకలో ఈ వీడియోలు వైరల్‌గా మారాయి. మఠాలు, స్వామీజీలపై సామాన్యులకు ఎంతో గౌరవం, భక్తి ఉంటుంది. కానీ ఇలాంటి వ్యవహారాలు బయటపడిన తర్వాత ఆ గౌరవం మంటగలిసే అవకాశముంది. ఉత్తరాదిలో డేరాబాబా లాంటి ఉదంతాలు కోకొల్లలు. ఇప్పుడు దక్షిణాదిన బండేమఠంలో ఏకంగా మఠాధిపతి హనీట్రాప్‌కి బలవడం దారుణం.

Tags:    
Advertisement

Similar News