Yash | రామాయణం నిర్మాతగా యష్

Yash to produce Ramayana - రామాయణం ప్రాజెక్టులోకి యష్ చేరాడు. కేవలం నటుడిగానే కాదు, నిర్మాతగా కూడా పని చేయబోతున్నాడు.

Advertisement
Update: 2024-04-13 01:04 GMT

రామాయణం సినిమాలో యష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడీ ప్రాజెక్టులో అతడు మరో పాత్ర కూడా పోషించబోతున్నాడు. రామాయణంలో నటిస్తూనే, నిర్మాతగానూ వ్యవహరించబోతున్నాడు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, యష్ కు చెందిన మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్ కలిపి రామాయణం నిర్మించబోతున్నాయి.

నమిత్ మల్హోత్రా, రాకింగ్ స్టార్ యాష్ తో కలిసి నితేష్ తివారి దర్శకత్వంలో, రామాయణాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటివరకు చూడని అద్భుతమైన విజువల్ ఎఫెక్టులు ఇందులో చూడబోతున్నారు.

యష్ మాట్లాడుతూ.. "నాకు ఎప్పటి నుండో ఉన్న కల, మన భారతీయ సినిమాని ప్రపంచ వేదిక మీద ఉంచాలని. నమిత్ నేను రామాయణం చేస్తే బాగుంటుందని చాలా సార్లు అనుకున్నాం, కాని అంత పెద్ద సబ్జెక్టు తియ్యాలంటే మాములు విషయం కాదు, బడ్జెట్స్ కూడా సరిపోవు అందుకే నేను కూడా కో ప్రొడ్యూస్ చెయ్యాలనుకున్నాను. రామాయణానికి నా మనసులో ఒక సుస్థిర స్థానం ఉంది. దాని కోసం ఎంతైనా కష్టపడతాను. ప్రపంచ వేదికలో ప్రేక్షకులకి మంచి అనుభూతిని ఇస్తాను." అంటూ ప్రకటించాడు.

ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా కనిపించబోతున్నాడు. ఇక సీతగా సాయిపల్లవి నటిస్తోంది. వీళ్లిద్దరూ ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇక యష్ ఇందులో రావణుడిగా కనిపించబోతున్నాడు.

Tags:    
Advertisement

Similar News