Vennela Kishore | యాక్షన్ కామెడీ హీరోగా వెన్నెల కిషోర్

Vennela Kishore - వెన్నెల కిషోర్ హీరోగా మారాడు. చారి-111 అనే సినిమా చేస్తున్నాడు.

Advertisement
Update: 2023-08-24 02:22 GMT

వినోదానికి కేరాఫ్ అడ్రస్ 'వెన్నెల' కిశోర్. మేనరిజమ్స్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, నటనతో కావచ్చు... వినోదంలో వైవిధ్యం చూపిస్తూ, ప్రేక్షకులకు నవ్వులు పంచుతూ అలరిస్తున్నాడు. హాస్య నటుడిగా మాత్రమే కాదు, హీరోగానూ తనకు సూటయ్యే క్యారెక్టర్లు వచ్చినప్పుడు సినిమాలు చేస్తుంటాడు. 'వెన్నెల' కిశోర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'చారి 111'.

'వెన్నెల' కిశోర్ హీరోగా బర్కత్ స్టూడియోస్ బ్యానర్ పై అదితి సోనీ నిర్మిస్తున్న సినిమా 'చారి 111'. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. సుమంత్ హీరోగా నటించిన హిట్ సినిమా 'మళ్ళీ మొదలైంది' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.

ఇందులో 'వెన్నెల' కిశోర్ సరసన సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్ గా నటిస్తోంది. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తాజాగా సినిమాను ప్రకటించడంతో పాటు కాన్సెప్ట్ టీజర్ కూడా విడుదల చేశారు.

ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే సిటీకి ప్రమాదం వచ్చి పడుతుంది. దానిని ఎదిరించడం కోసం మాజీ ఆర్మీ అధికారి ప్రసాద్ రావు (మురళీ శర్మ) వస్తారు. అసలు, ఆ సమస్య ఏమిటి? విలన్ ఎవరు? అనేది వెల్లడించలేదు. కానీ, హీరో క్యారెక్టర్ ఏమిటనేది చాలా క్లారిటీగా చూపించారు. గందరగోళానికి గురయ్యే స్పై పాత్రలో వెన్నెల కిశోర్ కనిపించనున్నాడు. ఇక ఈషా పాత్రలో హీరోయిన్ సంయుక్త విశ్వనాథన్, మహి పాత్రలో ప్రియా మాలిక్ నటిస్తున్నారు.

బేసిగ్గా ఇదొక యాక్షన్ కామెడీ సినిమా. 'వెన్నెల' కిశోర్ ఇందులో గూఢచారిగా కనిపిస్తాడు. సిటీకి సమస్య వస్తే గూఢచారి ఏం చేశాడనే విషయాన్ని ఫన్నీగా చూపించారు. మరో రెండు కీలక పాత్రల్లో బ్రహ్మాజీ, రాహుల్ రవీంద్రన్ కనిపించనున్నారు.

Full View

Tags:    
Advertisement

Similar News