Captain Miller | వెంకీ-నాగ్ చేతులమీదుగా 'కెప్టెన్ మిల్లర్' ట్రయిలర్

Captain Miller - ధనుష్ హీరోగా నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమా తెలుగులో విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ ట్రయిలర్ ను నాగ్-వెంకీ సంయుక్తంగా విడుదల చేశారు.

Advertisement
Update: 2024-01-18 15:43 GMT

నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ నటించిన పాన్ ఇండియా సినిమా కెప్టెన్ మిల్లర్. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జనవరి 25న తెలుగులో రిలీజ్ అవుతోంది. ఏషియన్ మల్టీప్లెక్స్, సురేష్ ప్రొడక్షన్స్ కలిసి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాయి. సంక్రాంతికి జనవరి 12న తమిళనాట రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ అందుకుంది. ఇప్పుడు తెలుగు ట్రైలర్ విడుదలైంది. కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

ధనుష్‌ను టైటిల్ రోల్‌ లో కెప్టెన్ మిల్లర్ గా పరిచయం చేస్తూ, బ్రిటిష్ పాలనలో స్వతంత్రానికి ముందు కాలంలోకి మనల్ని తీసుకువెళుతుంది ట్రైలర్. ధనుష్ తన గ్రామాన్ని దోచుకోవడానికి ప్రయత్నించే వలసవాదులను ఎదుర్కొంటూ స్థానిక తిరుగుబాటు నాయకుడిగా కనిపించారు. అతన్ని బ్రిటీష్ వారు డకాయిట్ అని, స్థానికులు దేశద్రోహి అని పిలుస్తారు. ధనుష్ యాక్షన్స్ ఇతరుల ప్రవర్తనపై ఆధారపడి ఉందని ట్రైలర్ ద్వారా స్పష్టమైంది.

ధనుష్ డిఫరెంట్ అవతార్స్ లో కనిపించారు. అద్భుతమైన నటనను కనపరిచి సినిమాను తన భుజాలపై నడిపారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా, సందీప్ కిషన్, శివ రాజ్ కుమార్ కూడా ట్రైలర్‌లో ఆకట్టుకున్నారు.

అరుణ్ మాథేశ్వరన్ కథను ఆసక్తికరంగా మలిచాడు. ధనుష్‌ని మునుపెన్నడూ లేని విధంగా ఇంటెన్స్, యాక్షన్ అవతార్‌లో చూపించాడు. జివి ప్రకాష్ కుమార్ తన అద్భుతమైన స్కోర్‌తో విజువల్స్‌ను ఎలివేట్ చేశాడు. ఈ సినిమాతో తెలుగులో మరోసారి సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు ధనుష్.

Full View

Tags:    
Advertisement

Similar News