Waltair Veerayya: శ్రీదేవి-చిరంజీవి కలిసి వచ్చారు

Waltair Veerayya: చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా నుంచి సెకెండ్ సాంగ్ వచ్చేసింది. ఈసారి మెలొడీ సాంగ్ రిలీజ్ చేశారు.

Advertisement
Update: 2022-12-20 04:09 GMT

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన బాస్ పార్టీ సాంగ్ పెద్ద హిట్టయింది. బాస్ పార్టీ సాంగ్ 28 మిలియన్ల వ్యూస్ ని క్రాస్ చేసి రీల్ మేకర్స్ కు ఫేవరెట్ గా మారింది. ఇప్పుడు సెకండ్ సింగిల్ 'నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి' మేకర్స్ విడుదల చేశారు.

దేవి శ్రీ ప్రసాద్ ఈ పాటను అందంగా కంపోజ్ చేశాడు. జస్‌ప్రీత్ జాస్, సమీరా భరద్వాజ్‌ ఈ పాటను అంతే అందంగా ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది.

చిరంజీవి తన గ్రేస్ ఫుల్ డ్యాన్స్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. చిరంజీవి బ్లేజర్లు ధరించి స్టైలిష్‌గా ఉన్నారు. శృతి హాసన్ రంగురంగుల చీరల్లో అద్భుతంగా ఉంది. వారి జంట చూడముచ్చటగా ఉంది. మంచుతో కప్పబడిన లొకేషన్ మరొక హైలైట్.

పాటలో 'మౌత్ ఆర్గాన్ స్టెప్' సిగ్నేచర్ మూమెంట్ గా ఆకర్షించింది. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశాడు.

ఈ సినిమా షూటింగ్ యూరప్‌లో పూర్తి చేసుకొని చిరంజీవి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. వాల్తేరు వీరయ్య జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Full View


Tags:    
Advertisement

Similar News