బన్నీ-త్రివిక్రమ్ మధ్య మళ్లీ కథా చర్చలు

అల్లు అర్జున్, త్రివిక్రమ్ మధ్య మరోసారి కథా చర్చలు మొదలయ్యాయి. అల వైకుంఠపురములో సినిమా తర్వాత ఈ కాంబో మరోసారి కలవబోతోంది.

Advertisement
Update: 2022-10-10 04:46 GMT

వీళ్లిద్దరూ కలిసి గతంలో అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి బన్నీ, త్రివిక్రమ్ కలవబోతున్నారు. ఇద్దరూ కలిసి కథా చర్చలు ప్రారంభించారు. త్వరలోనే ప్రకటన రాబోతోంది.

ఓవైపు పుష్ప-2 సినిమా లైన్లో ఉండగానే, త్రివిక్రమ్ తో స్టోరీ డిస్కషన్లు మొదలుపెట్టాడు అల్లు అర్జున్. అటు మహేష్ బాబుతో సినిమా సెట్స్ పై ఉన్నప్పటికీ అల్లు అర్జున్ తో కథా చర్చలు సాగిస్తున్నాడు త్రివిక్రమ్. దీనికి ఓ ప్రత్యేక కారణం ఉంది.

'అల వైకుంఠపురములో' సినిమా టైమ్ లో బన్నీ-త్రివిక్రమ్ కలిసి కొన్నాళ్ల పాటు జర్నీ చేశారు. రెగ్యులర్ గా జరిగే స్టోరీ డిస్కషన్లకు భిన్నంగా రకరకాల కథలు, సన్నివేశాలపై చర్చించుకుంటూ ట్రావెల్ చేశారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిని ఫాలో అవ్వాలని నిర్ణయించారు.

రకరకాల స్టోరీలైన్స్, సీన్స్ పై ఎప్పటికప్పుడు ఇద్దరూ అలా చర్చించుకుంటారు. అలా ఆర్గానిక్ గా పుట్టిన కథను ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఇలా తరచుగా కలుస్తున్నారు వీళ్లిద్దరూ. ఈ గ్యాప్ లో బన్నీ పుష్ప-2 సినిమాను, త్రివిక్రమ్, మహేష్ మూవీని పూర్తిచేస్తారు. 

Tags:    
Advertisement

Similar News